News March 31, 2025

వ్యక్తిగత గొడవల్ని పార్టీలకు ఆపాదించవద్దు: పరిటాల

image

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.

Similar News

News February 12, 2026

110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

image

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.

News February 12, 2026

మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

image

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.

News February 12, 2026

ATP: ఉత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

image

అనంతపురం జిల్లాలో బ్రహ్మోత్సవాలు, జాతరలు, శివరాత్రి పర్వదినాల సందర్భంగా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ సెక్యూరిటీ ఆడిట్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.