News March 31, 2025
వ్యక్తిగత గొడవల్ని పార్టీలకు ఆపాదించవద్దు: పరిటాల

రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో జరిగిన ఘటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. గ్రామంలో ఉగాది పండుగ నేపథ్యంలో కొందరు తమ పెద్దల సమాధుల వద్ద, దేవాలయం వద్ద పూజలు చేసి వస్తుండగా.. ఈ గొడవ మొదలైందన్నారు. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని అన్నారు.
Similar News
News April 2, 2025
గద్వాల జిల్లా పోలీసుల సీరియస్ WARNING

గతంలో ఎప్పుడో జరిగినా వివాదాలు పరిష్కారమై, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో తిరిగి వాటికి సంబంధించిన వీడియోలను మళ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల సీఐ శ్రీను హెచ్చరించారు. కావాలని పాత విభేదాలు కలిగి ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ పోస్టు చేసే వారిపై, ఫేక్ న్యూస్ను వైరల్ చేసే వారిపై జిల్లా పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టిందని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 2, 2025
నారాయణపేట: ‘విద్యార్థుల అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. యూనివర్సిటీలో భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ తరఫున విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా భూములు తీసుకునే విషయంలో వెనక్కి తగ్గాలని సూచించారు.
News April 2, 2025
MNCL: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మంచిర్యాలలోని రాళ్లపేటకు చెందిన తెలంగాణ హోటల్ యజమాని ప్రభుదాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన ప్రభుదాస్ను భార్య మందలించగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లని ఆయన ఇవాళ తెల్లవారుజామున హోటల్ పక్కన గల్లీలో ఒక ఇంటి ముందు సృహ కోల్పోయి ఉన్నారు. అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. ఈ మేరకు ఎస్సై వినీత కేసు దర్యాప్తు చేస్తున్నారు.