News April 19, 2025

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ 

image

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.

Similar News

News December 14, 2025

విశాఖలో ఉత్సాహంగా నేవీ మారథాన్

image

నేవీ డే వేడుకల్లో భాగంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఆదివారం ఉదయం ‘నేవీ మారథాన్’ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ మారథాన్‌లో నగర వాసులు, నేవీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

News December 14, 2025

ప్రభుత్వ కార్యాలయాలలో రేపు PGRS: విశాఖ కలెక్టర్

image

విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో డిసెంబర్ 15న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 14, 2025

క్రమశిక్షణ గల పౌరులను అందించే పరిశ్రమ ఏయూ: గంటా

image

ఆంధ్రా యూనివర్సిటీ నైతిక విలువలు, క్రమశిక్షణ గల భావి పౌరులను తయారు చేసే పరిశ్రమ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ అనేక మంది నాయకులు, క్రీడాకారులు, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు.