News July 6, 2025

వ్యాసాశ్రమంలో దశాబ్దాల తర్వాత కలిశారు..!

image

ఏర్పేడు(M) వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. 1965 నుంచి 2000వ సంవత్సరం వరకు చదవిన దాదాపు 150 మంది రావడంతో అందరిలోనూ సంతోషం నెలకొంది. ఇక్కడ చదివిన తామంతా ఉన్నతస్థాయికి చేరామని, ఇదంతా మలయాళస్వామి కృపేనని పేర్కొన్నారు. ఏర్పేడులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరూ వ్యాసాశ్రమంలో చదివారా? బ్యాచ్ పేరుతో కామెంట్ చేయండి.

Similar News

News July 6, 2025

అదరగొట్టిన ఆకాశ్‌దీప్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్ ఆకాశ్‌దీప్ సత్తా చాటారు. 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. తన కెరీర్‌లో ఒక ఇన్నింగ్సులో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేయడం విశేషం.

News July 6, 2025

ఫాతిమా కాలేజీని కూలుస్తారా? ‘హైడ్రా’ రంగనాథ్ ఏమన్నారంటే?

image

HYDలో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన ఫాతిమా కాలేజీ సలకం చెరువు FTLలో ఉండటంతో దాన్ని కూల్చివేయాలని ఎన్నో డిమాండ్లు వస్తున్నాయి. దానిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ‘అక్బరుద్దీన్‌పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీని నిర్మించారు. అందులో చాలా మంది ఉచితంగా చదువుకుంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. మేము జీవితాలను నాశనం చేయం. ఫైనల్ రిపోర్ట్ రానివ్వండి’ అని ట్విటర్ స్పేస్‌లో అన్నారు.

News July 6, 2025

జగిత్యాల: పలువురు ఎస్ఐలకు స్థాన చలనం

image

జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు బాసర మల్టీజోన్ ఐజీ 2 ఉత్తర్వులు జారీ చేశారు. కే. కుమారస్వామి బీర్పూర్ నుంచి డీఎస్‌బీ జగిత్యాల, మిర్యాల రవీందర్ వీ.ఆర్ జగిత్యాల నుంచి ధర్మపురి ఎస్సై 2, ఎస్.రాజు వీ.ఆర్ జగిత్యాల నుంచి బీర్పూర్, ఎం.సుప్రియ వీ.ఆర్ జగిత్యాల నుంచి సీసీఎస్ జగిత్యాలకు ట్రాన్స్ఫర్ అయినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.