News January 20, 2026
వ్యాసుడు చెప్పిన కొన్ని పవిత్ర ధర్మాలు

మూగ జీవులను హింసించకూడదు.
అబద్ధాలు చెప్పకూడదు.
దొంగతనం చేయకూడదు.
ఇతరుల ఆహారం అపహరిస్తే నరకానికి వెళ్తారు.
తెలిసి పాపాలు చేసిన వారు పూజలు చేయకూడదు.
రహస్యాలు రహస్యంగానే ఉంచాలి.
వేదాలను, గురువులను, నిందించరాదు.
కపటం గలవారితో కలిసి పుణ్య కార్యాలు చేయకూడదు.
పర స్త్రీని తల్లిలా భావించి, గౌరవించాలి.
Similar News
News February 12, 2026
ACTRECలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టాటా మెమోరియల్ సెంటర్ -అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్, రీసెర్చ్& ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(ACTREC) 25 మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో DM/DNB, MD, MSc/మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్/MBBS/BDS/BAMS/BHMS/ఫార్మా డీ, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://actrec.gov.in
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘చంద్రశేఖర’’

దక్షుడి శాపం వల్ల చంద్రుడి కళలు క్షీణించి, ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చంద్రుడు శివుడిని శరణు వేడగా ఆయన కరుణించాడు. చంద్రుడిని తన తలపై నెలవంకగా ధరించాడు. అలా చంద్రుడికి పునర్జన్మనిచ్చి లోకానికి వెలుగు ప్రసాదించాడు. తనను ఆశ్రయించిన వారికి మృత్యు భయం ఉండదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చంద్రుడిని శిఖరంపై(తలపై) అలంకారంగా ధరించిన వాడు కాబట్టి ఆయనను ‘చంద్రశేఖరుడు’గా కీర్తిస్తున్నాం.
News February 12, 2026
ఎండు మేతతో పొట్టేళ్లకు లాభం

పొట్టేళ్ల పెంపకంలో పచ్చి మేత కంటే ఎండు మేతే చాలా ముఖ్యమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ పొట్టు, ఉలవ పొట్టు, కంది పొట్టు వంటి చాలా రకాల ఎండు మేతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొట్టేళ్లు చాలా ఇష్టంగా తింటాయి. దీని వల్ల అవి చాలా ఆరోగ్యంగా ఉంటూ, ఎక్కువ బరువు పెరుగుతాయి. అందుకే పచ్చిమేత కాస్త తక్కువైనా, ఎండు మేతను వెటర్నరీ నిపుణుల సూచనలతో సరైన పరిమాణంలో అందేలా చూసుకోవాలి.


