News March 21, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కుమారుడు మృతి

శంకరపట్నం మండలం కేశవపట్నం బస్టాండ్ వద్ద << 15837379>>లారీ, బైకు ఢీకొన్న<<>> సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మక్తకి చెందిన ఎస్కే అజీమ్, తన కుమారుడు రెహమాన్ శంకరపట్నం నుంచి బైకుపై ఇంటికి వెళ్తుండగా.. కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో బైక్పై వెళ్తున్న మెట్పల్లికి చెందిన మందాడి శ్రీనివాస్రెడ్డికి గాయాలయ్యాయి.
Similar News
News March 21, 2025
చొప్పదండి: భారీ వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంట

చొప్పదండి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కురిసిన వర్షానికి చేతికి అందే పంట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోయారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో నియోజకవర్గంలోని రోడ్లు జలమయమయ్యాయి. వర్షం ధాటికి తీవ్రంగా నష్టపోయామని రైతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
News March 21, 2025
HZB: కాకతీయ కెనాల్ కాలువలో మృతదేహం

హుజూరాబాద్ మండలం తుమ్మపల్లి కాకతీయ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 21, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.9°C నమోదు కాగా, శంకరపట్నం 37.8, కరీంనగర్ రూరల్ 37.6, జమ్మికుంట 37.5, గన్నేరువరం 36.8, చొప్పదండి, మానకొండూర్ 36.6, రామడుగు 36.5, చిగురుమామిడి 36.4, వీణవంక 36.3, తిమ్మాపూర్ 36.1, కరీంనగర్ 36.0, కొత్తపల్లి 35.2, ఇల్లందకుంట 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.0°C గా నమోదైంది.