News April 1, 2024
శంకర్పల్లి: గుర్తు తెలియని మహిళ మృతి

గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. సోమవారం CI తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధి రామంతాపూర్లో గౌండ్ల పాండు గౌడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ(55) మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై ఆరెంజ్ క్రీమ్ కలర్ చీర, బ్లూ కలర్ జాకెట్ ఉన్నాయి. ఆహారం దొరకక, ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి మహిళ చనిపోయిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 19, 2025
HYDలో తగ్గిన ఎయిర్ క్వాలిటీ.. జాగ్రత్త!

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్నగర్, జీడిమెట్ల, మల్లాపూర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
News December 19, 2025
HYD బుక్ ఫెయిర్ మొదలైంది అప్పుడే..!

హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి DEC 29 వరకు బుక్ ఫెయిర్ జరుగుతుంది. 1985లో మొదట అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ప్రారంభమైన ఈ ఫెయిర్, తరువాత నిజాం కళాశాల, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లకు విస్తరించింది. ప్రజల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
HYD: రైలు ప్రయాణికులకు GOOD NEWS

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ-వికారాబాద్, సికింద్రాబాద్–కాకినాడ, తిరుపతి–VKB, నర్సాపూర్–వికారాబాద్, లింగంపల్లి–నర్సాపూర్, లింగంపల్లి–కాకినాడ, వికారాబాద్–కాకినాడ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. రైళ్లకు బుకింగ్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 1.5% బుకింగ్ పూర్తి అయిందన్నారు.


