News April 25, 2024

శంషాబాద్: ఏడాదిలో 2.5 కోట్ల మంది ప్రయాణం!

image

2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2.5 కోట్ల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. 2018-19 లో 2.1కోట్ల మంది ప్రయాణించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2023-24 లో 1.76 లక్షల విమాన సర్వీసులు రాకపోకలు సాగించాయి. అదే విధంగా 2023-24 లో 1.54 లక్షల మెట్రిక్ టన్నులు కార్గో సేవలను నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 3, 2025

మూల మలుపు.. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణం?

image

మీర్జాగూడ ప్రమాదంపై రవాణా శాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటు బస్సు, అటు టిప్పర్ రెండు ఓవర్ స్పీడ్‌తో వచ్చాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మూల మలుపు కూడా ఉందని, దీంతో రెండు వాహనాలు ఢీ కొట్టగానే కంకర మొత్తం ప్రయాణికుల మీదకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కంకర కూడా ఓవర్ లోడ్ కావడంతో.. బరువు పెరిగి అదుపుతప్పినట్లు అంచనా వేస్తున్నారు.

News November 3, 2025

HYD: ఘోరం.. ఉలిక్కపడ్డ మీర్జాగూడ

image

RTC బస్సు ప్రమాద ఘటనతో మీర్జాగూడ ఉలిక్కిపడింది. ఉ.6 గంటల వరకు అంతా ప్రశాంతంగా ఉంది. హైవే మీద ప్రమాదం జరిగిందని తెలుసుకున్న మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, బెస్తపూర్, ఖానాపూర్, కిష్టపూర్ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని ఆందోళనతో కొందరు యువకులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే రోడ్ల మీద మృతులు, కంకర కింద క్షతగాత్రులను చూసి చలించిపోయారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారు.

News November 2, 2025

HYD: KCR వైపే ప్రజలు: మల్లారెడ్డి

image

KCR వైపే ప్రజలంతా ఉన్నారని మాజీ మంత్రి, మేడ్చల్ MLA మల్లారెడ్డి అన్నారు. ఈరోజు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు చెందిన 6వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పల్లపు రవి, 300 మంది కార్యకర్తలతో కలిసి BRSలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. BRS మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ మహేందర్ రెడ్డి, నాయకులు కొండల్ ముదిరాజ్, రాజశేఖర్, జిట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.