News November 24, 2025
శబరిమల యాత్రకు మంథని డిపో నుంచి ప్రత్యేక బస్సు

శబరిమల భక్తుల కోసం మంథని డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు DM శ్రావణ్కుమార్ తెలిపారు. వెళ్లేటప్పుడు మంథని-హైదరాబాద్-శ్రీశైలం-మహానంది-కాణిపాకం-పంబ, తిరుగు ప్రయాణంలో మదురై-రామేశ్వరం-తిరుపతి మార్గంగా బస్సు నడుస్తుంది. చార్జీ ₹6900. బార్డర్ ట్యాక్స్, పార్కింగ్ ఫీజులు ప్రయాణికులే చెల్లించాలి. 35 సీట్లు బుక్ చేసిన గ్రూపులకు 5మందికి ఉచిత ప్రయాణం. బుకింగ్కు: 9959225923, 9948671514
Similar News
News November 24, 2025
కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.
News November 24, 2025
ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.
News November 24, 2025
HYD: జాతీయ శిక్షణకు బాలికలకు అవకాశం

రంగారెడ్డి జిల్లాలో 12-16 ఏళ్ల బాలికల కోసం ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. 60M, 600M, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఈవెంట్లలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు ఈ నెల 28న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఉ.8 గం.కు రిపోర్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. జిల్లా స్థాయిలో అర్హత సాధించిన వారికి జాతీయ స్థాయి క్యాంపులో ప్రత్యేక శిక్షణ లభిస్తుంది.


