News July 9, 2024
శభాష్.. ధీరజ్: నారా లోకేశ్

పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన విజయవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘బొమ్మదేవర ధీరజ్ 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్న రికర్వ్ ఆర్చర్కు నా శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల ఆసియా టోర్నీలో రజతంతో మెరిసిన 22 ఏళ్ల ధీరజ్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
Similar News
News September 15, 2025
కృష్ణా: 13 మంది ఎంపీడీఓలకు పదోన్నతి

కృష్ణా జిల్లాలో నలుగురు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 9 మంది డిప్యూటీ ఎంపీడీఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన వారికి జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు పాల్గొన్నారు.
News September 15, 2025
కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
News September 15, 2025
MTM: ఎస్పీ గంగాధరరావుకు ఘన వీడ్కోలు

కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఆర్. గంగాధరరావు ఐపీఎస్కు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. మచిలీపట్నం గోల్డ్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్పీతో తమ అనుభవాలను పంచుకున్నారు. తమకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి గంగాధరరావు కృతజ్ఞతలు తెలిపారు.