News December 8, 2025
శరీరంలోని ఈ భాగానికి రక్తం అవసరం లేదు!

మానవ శరీరంలో రక్త ప్రసరణ జరగని ఓ భాగం ఉందనే విషయం మీకు తెలుసా? కంటిలోని కార్నియాకు రక్తప్రసరణ జరగదు. ఇది తన అవసరాలకు సరిపడా ఆక్సిజన్ను రక్తం ద్వారా కాకుండా నేరుగా వాతావరణంలోని గాలి నుండే గ్రహిస్తుంది. కార్నియాకు రక్తనాళాలు లేకపోవడం వల్లే అది పూర్తి పారదర్శకంగా ఉండి కాంతిని అడ్డుకోకుండా స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అలాగే జుట్టు, గోర్లకు కూడా రక్త ప్రసరణ జరగదు. కానీ ఇవి నిర్జీవ కణాలు.
Similar News
News December 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 90 సమాధానం

ప్రశ్న: రామాంజనేయుల నడుమ యుద్ధమెందుకు జరిగింది?
సమాధానం: రాముని గురువు విశ్వామిత్రుడిని కాశీ రాజు యయాతీ అవమానించాడు. దీంతో యయాతిని చంపమని రాముడిని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. అటువైపు తన ప్రాణాలు కాపాడమని యయాతి ఆంజనేయుడిని శరణు వేడాడు. అలా ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆంజనేయుడు పలికిన రామనామం రాముని బాణాలు నిలవలేకపోయాయి. దీంతో విశ్వామిత్రుడు యుద్ధాన్ని ఆపి, యయాతిని క్షమించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


