News August 3, 2024

శాంతిభద్రతలపై దృష్టి పెట్టండి. మంత్రి సంధ్యారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మంత్రి సంధ్యారాణిని శనివారం సాయంత్రం మంత్రి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళలు, చిన్నారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ కల్పించాలని సూచించారు.

Similar News

News February 26, 2026

చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ

image

ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. CHC వద్ద ప్రత్యేక వేదిక, సాంకేతిక& వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

News February 26, 2026

VZM: నీట్ పరీక్షకు జిల్లాలో ఆరు కేంద్రాలు

image

మే 3న నిర్వహించే నీట్ పరీక్ష‌కు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లో గల ఏ.పీ.మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హైస్కూల్లలో నిర్వహిస్తామన్నారు. కేంద్రాల్లో 1800 మంది పరీక్ష రాసే సామర్థ్యం ఉందన్నారు.

News February 26, 2026

అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్

image

ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.