News March 21, 2025
శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

విజయవాడ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించానన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటులో పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 8, 2025
ADB: గోదావరిలో యువకుడి గల్లంతు

గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జన్నారం మండల కేంద్రానికి చెందిన శ్రావణ్ నానమ్మకు శుక్రవారం సంవత్సరికం చేశారు. శనివారం ఉదయం బాదంపల్లి శివారులోని గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లాడు. గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లే క్రమంలో గల్లంతయ్యాడు.
News November 8, 2025
గొప్ప కృష్ణభక్తుడు ‘కనకదాసు’

AP: ఇవాళ భక్త కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈయన అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. కర్ణాటకలోని బాడా గ్రామంలో 1509లో జన్మించారు. చిన్నతనం నుంచే శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. సాధారణ ప్రజలకూ అర్థమయ్యేలా ఎన్నో కీర్తనలు, గ్రంథాలను రాశారు. ఈయన జయంతిని సెలవుదినంగా ప్రకటించి కర్ణాటక ప్రభుత్వం పండుగలా నిర్వహిస్తుంది. కురబలు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలోనూ వేడుకలు ఘనంగా జరుపుతారు.
News November 8, 2025
కుప్పంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు.. 22 వేల మందికి ఉపాధి

☞ <<18231350>>ఆదిత్య బిర్లా<<>>- రూ.586 కోట్లు(Cr) పెట్టుబడి- 920 మందికి ఉపాధి
☞ ACE పరిశ్రమ- రూ.525 Cr పెట్టుబడి – 7 వేల మందికి ఉపాధి
☞ SVF సోయా- రూ.372.8 Cr పెట్టుబడి- 2500 మందికి ఉపాధి
☞ మదర్ డెయిరీ- రూ.260 Cr పెట్టుబడి- 4000 మందికి ఉపాధి
☞ శ్రీజ కంపెనీ- రూ.233Cr పెట్టుబడి- 4 వేల మందికి ఉపాధి
☞ ఈ-రాయిస్- రూ.200Cr పెట్టుబడి- 410 మంది ఉపాధి
☞ ALEAP పరిశ్రమ-రూ.26.7Cr పెట్టుబడి- 3500 మందికి ఉపాధి.


