News August 25, 2025
శాంతియుతంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి: ఎస్పీ

నిర్మల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
Similar News
News August 25, 2025
6,589 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

SBIలో 6,589 జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. అభ్యర్థుల వయసు 20-28 ఏళ్లు ఉండాలి. డిగ్రీ చేసిన వారు అర్హులు. ఫైనలియర్ చదువుతున్న వారూ అప్లై చేయవచ్చు. కానీ DEC 31, 2025కి ముందు డిగ్రీ పాసై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, OBC, EWS కేటగిరీ విద్యార్థులకు ₹750. మిగతా వారికి లేదు.
వెబ్సైట్: <
News August 25, 2025
మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో కలెక్టర్

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాల వల్ల జరిగే కాలుష్యం గురించి వివరించారు.
News August 25, 2025
WNP: ముఖ చిత్ర గుర్తింపుతో పింఛన్లు పంపిణీ

వనపర్తి జిల్లాలో సామాజిక పింఛన్లు ఇక నుండి ముఖ చిత్ర గుర్తింపు ద్వారా ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇక నుంచి వెలి ముద్రల గుర్తింపు ఇబ్బంది లేకుండా ముఖ చిత్రం గుర్తింపు ద్వారా పోస్టాఫీసుల్లో పింఛన్లు ఇవ్వనున్నారు. దీనికోసం సోమవారం పోస్టాఫీస్ అధికారికి 74 ముఖ చిత్ర గుర్తింపు చేసే సెల్ ఫోన్లను కలెక్టర్ అందజేశారు. డీఆర్డీఓ, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.