News October 14, 2025

శావల్యాపురం: మహిళ మాటలు నమ్మి మునిగాడు..!

image

మూడు నెలల్లో అమౌంట్ డబుల్ అవుతుందని ఓ మహిళ చెప్పడంతో నమ్మి శావల్యాపురం(M) మతకపల్లికి చెందిన సంపంగిరావు మోసపోయినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం.. ‘ఆన్‌లైన్‌లో పరిచయమైన మహిళ రైస్ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో డబుల్ అవుతుందని చెప్పింది. దాని కోసం రూ.7 లక్షలు తనకు పంపాను. తీసుకుని ఆమె మోసం చేసింది’ అని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్‌లో కంప్లైంట్ ఇచ్చాడు.

Similar News

News October 14, 2025

KNR: బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం..!

image

KNR(D) కొత్తపల్లి PS పరిధిలో ఘోరం జరిగింది. ఓ బాలికకు ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతాని(గ్రానైట్ క్వారీ)కి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కాగా, వీరందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడం గమనార్హం. బాలిక, యువకులు చిన్నపటి నుంచి కలిసి తిరిగేవారు. ఈ క్రమంలోనే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేశారు. వీడియో వైరలై బాలిక కుటంబీకుల కంటపడింది.

News October 14, 2025

రేపటి నుంచి నో ఫ్లై జోన్ : కర్నూలు ఎస్పీ

image

రేపటి నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో ‘No Fly Zone for Drones’గా ప్రకటించామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రధాని <<18001616>>మోదీ<<>> పర్యటన ప్రాంతాల్లో 200 సీసీ కెమెరాలతో నిఘా, 7500 మంది పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం పసుపుల రోడ్డులోని కన్వెకేషన్ హాల్‌లో బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు.

News October 14, 2025

BREAKING: లొంగిపోయిన మల్లోజుల

image

మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దికాలంగా ఈయన మావోయిస్టుల ప్రస్తుత పంథాకు వ్యతిరేకంగా లేఖలు విడుదల చేస్తుండటం తెలిసిందే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన 30 ఏళ్లుగా ఉద్యమంలో ఉన్నారు. ఈయనపై 100కు పైగా కేసులున్నాయి. రూ.1కోటి రివార్డు ఉంది.