News October 7, 2025

శిక్షణకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు: కలెక్టర్ హనుమంతరావు

image

స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరు కాని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం తుర్కపల్లి రైతు వేదికలో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు (పీఓలకు) నిర్వహించిన శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 7, 2025

మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

image

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్‌ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.

News October 7, 2025

5-17 వయసు వారికి ఉచితం: ADB కలెక్టర్

image

17 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌కు అక్టోబర్ 1 నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని
UIDAI తెలిపిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని గమనించి ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్లు దాటినా వారందరికి రూ.125 వసూలు చేస్తారని తెలిపారు.

News October 7, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం: CM చంద్రబాబు

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు, పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లాంట్‌ను నష్టాల నుంచి బయట పడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’ అని అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు.