News April 5, 2025
శిరివెళ్ల: కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

శిరివెళ్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామ YCP మండల కన్వీనర్ ఇందూరి ప్రతాపరెడ్డి శివాలయానికి వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ప్రతాపరెడ్డిని కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 13, 2025
రేపటి కోసం..

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
News November 13, 2025
నాగర్కర్నూల్: ‘పాఠశాల విద్యార్థులను బయటికి తీసుకెళ్లరాదు’

నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పాఠ్యపుస్తకాల కోసం ఆటోలో వెళ్లిన విద్యార్థులు గాయపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాల విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల బయటికి తీసుకెళ్లరాదని బుధవారం తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
News November 13, 2025
పిట్లం: ఎదురుగా వాహనం వస్తే అంతే సంగతులు!

బిచ్కుంద నుంచి బాన్సువాడ, అలాగే పిట్లం నుంచి బాన్సువాడ వెళ్లే రహదారులపై రైతులు రెండు వైపులా ధాన్యాన్ని ఆరబెట్టడంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మధ్యలో కేవలం కొంత భాగం మాత్రమే మిగలడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు కనిపించక ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.


