News November 18, 2025
శివతత్వంతోనే లోకానికి రక్ష: సామవేదం షణ్ముఖ శర్మ

శివతత్వంతోనే లోకానికి రక్షణ లభిస్తుందని ప్రవచనకర్త, వేద పండితులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. వేములవాడ క్షేత్రంలో ఏర్పాటు చేసిన శివ కారుణ్యం పురాణంపై ఆయన సోమవారం రాత్రి ప్రవచనం వినిపించారు. శివుడి ఆరాధనతో సమస్త మానవాళికి మేలు జరుగుతుందని, ప్రజలంతా దేవుడి ఆరాధనతో పాటు పరోపకారంతో ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Similar News
News November 18, 2025
KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.
News November 18, 2025
KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.
News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?


