News February 13, 2026

శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకూడదు: ఐజీ గోపీనాథ్

image

మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమైన ఆలయాల్లో క్యూలైన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని సిద్ధం చేయాలన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Similar News

News February 14, 2026

శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

image

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.

News February 14, 2026

శ్రీకాకుళం: పెరిగిన జీతాలు.. హర్షం వ్యక్తం చేసిన 108 సిబ్బంది

image

సీఎం చంద్రబాబు నాయుడు 108 సిబ్బంది జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈఎంటీలు 79, పైలెట్లు 79 మందికి ఈ నిర్ణయంతో వీరికి రూ.2,000లు అదనంగా వేతనం కలిపి అందనుంది. అంతేకాకుండా 5, 10 సంవత్సరాల్లో సర్వీస్ చేసిన వారికి ఆటోమెటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ చేయడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

News February 14, 2026

SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

image

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.