News December 22, 2024
శివాలయ అభివృద్ధికి కృషి చేస్తా: MLA మాధవి

కడప నగరంలోని మృత్యుంజయ కుంట శివాలయ అభివృద్ధికి కృషి చేస్తానని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. శివాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పరిశీలించారు. తమ హయాంలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News December 24, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో బుధవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2,240
News December 24, 2025
పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.
News December 24, 2025
మాజీ సీఎం జగన్ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.


