News September 20, 2025
శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.
Similar News
News September 20, 2025
VZM: స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన

విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన నెల రోజుల్లో 13,35,656 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య 65% పెరిగిందని, 4 రకాల బస్సుల్లో మొత్తం జీరో టిక్కెట్ రూ.4,85,01,735 అయినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు.
News September 20, 2025
దీపం-2 పథకం అమలుపై విజయనగరం జేసీ సమీక్ష

కలెక్టరేట్లో జేసీ సేతుమాధవన్ అధ్యక్షతన దీపం-2 పథకం అమలుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలలో జమ కానందుకు ఆధార్-బ్యాంక్ లింక్ సమస్యలు, ఖాతాలు బ్లాక్ కావడం ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వీటిని పరిష్కరించి లబ్ధిదారులకు సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. అదనపు డబ్బులు వసూలు చేసే డెలివరీ బాయ్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News September 20, 2025
విజయనగరంలో హైకోర్టు జడ్జిల పర్యటన

విజయనగరంలో పర్యటన నిమిత్తం ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ఇద్దరు జడ్జిలను కలెక్టర్ ఎస్.రామ సుందర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.