News October 28, 2025

శృంగేరి జగద్గురువులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం నల్లకుంటలోని శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా స్వామిజీ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీ స్వామికి సీఎం వివరించారు. ఆయన వెంట వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్ ఉన్నారు.

Similar News

News October 28, 2025

సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

image

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్‌ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.

News October 28, 2025

వనపర్తి: బాల్యవివాహానికి సహకరించే వారిపై కేసులు

image

బాల్య వివాహానికి సహకరించే ప్రతి ఒక్కరి పై కేసు నమోదు చేస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. మధ్యలో  చదువు మానేసిన ప్రతి అమ్మాయిని గుర్తించి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి విద్యాలయాల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 36 బాల్య వివాహాలు జరుగకుండా ఆపి బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

News October 28, 2025

ఆ వ్యాయామాలతో బ్రెస్ట్ క్యాన్సర్‌ కట్టడి

image

మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కణాల పెరుగుదలను 30 శాతం వరకూ తగ్గించడంలో రెసిస్టెన్స్‌ ట్రైనింగ్‌, హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు పనిచేస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కోవాన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వ్యాయామాల వల్ల మయోకిన్స్‌ రిలీజై రొమ్ము క్యాన్సర్‌ కణాల పెరుగుదలను 30 శాతం వరకు నెమ్మదిస్తుందని తేలింది.