News October 29, 2025

శేషాచలం కనుమల్లో కనుగొన్న గెక్కో జాతి బల్లి

image

ఏపీ తూర్పు కనుమల్లో కొత్తగా ఒక గెక్కో జాతి గుర్తించారు. తిరుమల వెంకటాద్రి పర్వత ప్రాంతంలోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్‌లో ZSI శాస్త్రవేత్తల బృందం ఈ చిన్న బల్లిని కనుగొంది. Hemiphyllodactylus venkattadri అనే పేరుతో నమోదు చేసిన ఈ జాతి, జన్యు పరీక్షల్లో ఇప్పటివరకు తెలిసిన ఇతర సన్నని గెక్కో జాతుల కంటే భిన్నమని తేలింది. ఇది ఏపీలో కనుగొనబడిన రెండో హెమిఫిల్లోడాక్టిలస్ జాతి.

Similar News

News October 29, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లావ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. పాత ఇండ్లలో ఎవరో ఉండకూడదని సూచించారు.

News October 29, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.

News October 29, 2025

సంగారెడ్డి: వరి కోతలను వాయిదా వేసుకోవాలి.. అధికారుల సూచన

image

తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున సంగారెడ్డి జిల్లా రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అందువల్ల రైతులు వాతావరణం మెరుగు పడేవరకు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.