News August 19, 2024
శ్రావణమాసంలో మండుతున్న ఎండలు.. అల్లాడిపోతున్న ప్రజలు
శ్రావణమాసం, వర్షాకాలం చల్లగా ఉండాల్సిన వాతావరణం వేసవిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక వేడిమి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆదివారం నేలకొండపల్లిలో అత్యధికంగా 42.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వేడిమి,ఉక్క పోత తట్టుకోలేక పగలే ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో భారీగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 7, 2024
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు
ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
News October 7, 2024
సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య
సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 7, 2024
న్యూజిలాండ్లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి
న్యూజిలాండ్ ఆక్లాండ్లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.