News October 4, 2025

శ్రీకాకుళంలో అక్టోబర్ 8-14వరకు ఆధార్ క్యాంపులు

image

అక్టోబర్ 8 నుంచి 14 వరకు ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరిండెండెంట్ హరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆముదాలవలస, శ్రీకాకుళం, టెక్కలి సబ్ పోస్ట్ ఆఫీస్, CR పురం, రాజాం, కొత్తూరు, పొందూరు, కోటబొమ్మాళి, హిరమండలం, కాశీబుగ్గ పాతపట్నం ప్రాంతాల్లో సేవలు అందించడం జరుగుతుందన్నారు. 5 నుంచి15 సంవత్సరాల పిల్లలు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News October 4, 2025

శ్రీకాకుళం జిల్లాలో 13,887 మందికి రూ.15 వేల సాయం

image

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున నగదును వారి అకౌంట్లలో నేడు జమ చేయనుంది. ఈ వాహన మిత్ర పథకానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,341 మంది ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొత్తం రూ.21 కోట్ల మేర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ నేడు నగదును జమ సీఎం చంద్రబాబు చేయనున్నారు.

News October 4, 2025

హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద తగ్గిన వరద ఉద్ధృతి

image

హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 75 వేల క్యూసెక్కులకు ఉన్న వరద నీరు శనివారం ఉదయం 6 గంటలకు 50 వేల క్యూసెక్కులకు చేరుకుందని డీఈ సరస్వతి తెలిపారు. 2, 3వ ప్రమాద సూచికలు తొలగించామని, ఒకటవ ప్రమాద సూచిక కొనసాగుతుందని ఆమె వివరించారు.

News October 4, 2025

SKLM: ‘27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి’

image

వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 27 గ్రామాల్లో 74 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 350 విద్యుత్ మీటర్ల వైర్లు తెగిపడ్డాయని, 5 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయని చెప్పారు. సుమారు రూ.20 లక్షలతో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. 600 మంది సిబ్బందిని 300 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని వినియోగించామన్నారు.