News August 17, 2025
శ్రీకాకుళంలో చికెన్ ధరలు ఇలా..!

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్, మటన్, చేపల ధరలు పెరిగాయి. బాయిలర్ స్కిన్ చికెన్ కిలో రూ. 210, స్కిన్లెస్ రూ.220, నాటుకోడి రూ.800కి విక్రయించారు. గత వారంతో పోలిస్తే ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మటన్ కిలో రూ. 900, చేపలలో బొచ్చలు రూ.250, కోరమీను రూ.450కి అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ వినియోగదారులు ఖర్చులు భారమవుతున్నాయని అంటున్నారు.
Similar News
News August 17, 2025
ఎంపీ కేశినేనిని కలిసిన ఎమ్మెల్యే శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదివారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఎంపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీషను ఎంపీ శాలువాతో సత్కరించి, కొండపల్లి బొమ్మను బహుకరించారు.
News August 17, 2025
టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

టెక్కలి – మెలియాపుట్టి రోడ్డు ఫ్లైఓవర్ సమీపంలో ఆదివారం వేకువజామున డీజిల్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. విశాఖ నుంచి పలాస వైపు వెళ్తున్న AP39 UU 7060 నంబరు లారీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 1033 హైవే అంబులెన్స్
ద్వారా అతన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News August 17, 2025
ఆదిత్యుని సన్నిధిలో రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పునేఠ

రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠ శనివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కలెక్టర్ బంగ్లా వద్ద ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, SP కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ ఈయనను మర్యాదపూర్వకంగా కలిశారు.