News April 5, 2024
శ్రీకాకుళంలో భానుడి భగ భగ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 2, 2025
గాంధీ శ్రీకాకుళంలో అడుగు పెట్టింది అప్పుడే!

తెల్లదొరలను ఎదిరించే దిశగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకుగాను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని దూసి రైల్వే స్టేషన్లలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రైలులో ప్రయాణించి జిల్లాకు చేరుకున్నారు. ఈ రైల్వే స్టేషన్లో సుమారు 15 నిమిషాల పాటు తెల్లదొరలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మహాత్మా గాంధీకి సంబంధించిన ఆనాటి గుర్తులు ఇప్పటికీ ఆ స్టేషన్లో ఉన్నాయి.
News October 2, 2025
SKLM జిల్లాలో 59 గ్రామాలకు వరద ముంపు: కలెక్టర్

వంశధార నాగావళి నదులతో పాటు 59 గ్రామాలకు అక్టోబర్ 3న వరద ముప్పు సంభవించనుందని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం, కొత్తూరు, పోలాకి, గార, జలుమూరు తదితల మండలాలలోని 48 గ్రామాలకు వరద ముంపు ఉండే అవకాశం ఉందన్నారు. తోటపల్లి నారాయణపురం జలవనరుల్లో వరదల వలన ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు ఉండొచ్చన్నారు.
News October 2, 2025
ఎచెర్ల: డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అక్టోబర్ 3, 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి. అడ్డయ్య బుధవారం తెలిపారు. అర్హత ఉన్న వారు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి నేరుగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు క్యాంపస్లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.