News June 23, 2024

శ్రీకాకుళంలో భార్యా పిల్లల అదృశ్యం

image

ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో భార్య పిల్లలు కనిపించడం లేదంటూ భర్త చంద్రయ్య ఇచ్చాపురం ఎస్ఐ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వివరాలు.. తొమ్మిదేళ్ల కిందట బాధితుడికి రాములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 13న భర్త చేపలవేటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, తెలిసినచోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

Similar News

News October 5, 2024

SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.

News October 5, 2024

ఆమదాలవలస: ‘ఖరీఫ్‌‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’

image

ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

News October 5, 2024

శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత

image

అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.