News February 28, 2025

శ్రీకాకుళంలో మార్చి 3న మెగా జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో మార్చి 3వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ వై పోలినాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న పది, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కల్పిస్తున్నామన్నారు. ఈ మేళాలో 12 సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.

Similar News

News February 28, 2025

శ్రీకాకుళం: కళ్లు తిరిగి రోడ్డుపై పడి వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం నగరంలోని పందుంపుళ్ల జంక్షన్లో కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై హరిక్రిష్ణ తెలిపిన వివరాల మేరకు.. విశాఖకి చెందిన ఎం. కోదండరావు (35) శ్రీకాకుళంలోని ఓ పండ్ల షాపులో పని చేస్తుంటాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. షాపులో పని ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డుపై పడి మృతి చెందాడు.

News February 28, 2025

సోంపేట: భర్త చితికి భార్య దహన సంస్కారాలు

image

సోంపేట మండలం హుకుంపేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెద్దింటి జానకి రావు గురువారం గుండెపోటుతో మరణించారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. భర్త చితికి భార్య దహన సంస్కారాలు చేశారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. 

News February 27, 2025

వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష

image

వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో గురువారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. శుక్రవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల కోసం ఉన్నతాధికారులతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. విజయవాడలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన ఆయన పలు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు.

error: Content is protected !!