News December 11, 2025

శ్రీకాకుళం: ‘అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15-29 వరకు శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకు జరిగే “అభ్యుదయం సైకిల్ యాత్ర”ను విజయవంతం చేయాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి కోరారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ నెల 15న ప్రారంబమయ్యే అభ్యుదయం సైకిల్ యాత్ర పలు శాఖల వారీగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. DM&HO, RDOలు ఉన్నారు.

Similar News

News December 12, 2025

శ్రీకాకుళం: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖుర్దా రోడ్డు డివిజన్‌లోని రాజ్ అథ్‌గర్, జోరాండా రోడ్డు మధ్య 3వ, 4వ లైన్ల ప్రారంభోత్సవం దృష్ట్యా విశాఖ-అమృత్సర్-విశాఖ (20807/08), గుణుపూర్-రూర్కెలా-గుణుపూర్(18117/18) రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ దారి మళ్లింపు ఈనెల 12, 13, 14, 16, 17, 19, 20వ తేదీలలో అమలులో ఉంటుందని GM పరమేశ్వర్ తెలిపారు.

News December 12, 2025

శ్రీకాకుళం: జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విఠల్

image

కూటమి ప్రభుత్వం 13 జిల్లాల గ్రంథాలయ చైర్మన్‌లను గురువారం రాత్రి ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పలాస నియోజకవర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ రావును నియమించింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

News December 12, 2025

SKLM: ‘వీఈఆర్ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి’

image

విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఇఆర్)లో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు ప్రతిపాదించిన 12 భారీ ప్రాజెక్టులకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టర్ మందిరంలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ఏఏ ప్రాజెక్టులకు ఏ దశలో ఉన్నాయో, వాటికి సంబంధించి భూసేకరణ, మౌలిక వసతులు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక, అభిప్రాయ వ్యక్తీకరణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.