News July 29, 2024

శ్రీకాకుళం: ఆగస్టు 3న రెండో విడత మెరిట్ జాబితా

image

ఆర్జీయూకేటి పరిధిలో శ్రీకాకుళంలో 863 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండో విడత మెరిట్ జాబితా వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పు కావాలంటే rgukt.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్‌సైట్‌ లింక్ ఈనెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు.

Similar News

News February 23, 2026

SKLM: డయేరియా గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్

image

శ్రీకాకుళం నగర పరిధిలో ప్రబలిన ధైర్య ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దినకర్ పుండ్కర్ సోమవారం పర్యటించారు. కాకివీధి, గుడివీధి, దమ్మలవీధి, మంగువారి తోట గ్రామాల్లో డయేరియా ప్రబలి పలువురు అస్వస్థకు గురయ్యారు. నీరు కాచి చల్లార్చి తాగాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినరాదని సూచనలు చేశారు. ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని 2,3 రోజులు ఇంట్లో నిలువ ఉన్న నీరు వాడకూడదన్నారు.

News February 23, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤పలాస:గూడ్స్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
➤శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్ కు 51 వినతులు
➤ఇచ్ఛాపురం: ఏసీబీ వలలో ఎంఈఓ
➤జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీల నిరసన
➤శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 662 మంది గైర్హాజరు
➤టెక్కలి: ఆటో-బైక్ ఢీ..ఆరుగురికి గాయాలు
➤జిల్లా వ్యాప్తంగా ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాలు

News February 23, 2026

డయేరియా అదుపునకు అత్యవసర చికిత్స అందించాలి: రామ్మోహన్

image

శ్రీకాకుళంలో డయారేయా కేసుల ఉద్ధృతిపై జిల్లా అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ సోమవారం అత్యవసరంగా సమీక్షించారు. రోగులకు అత్యవసర చికిత్స అందించి, వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాధి సోకడానికి గల కారణాలు అన్వేషించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరo అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.