News July 27, 2024
శ్రీకాకుళం: ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీఎస్సీపీసీఆర్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 26న జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను జులై 31లోగా పంపించాలని మొదట గడువు విధించారని, ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారని తెలిపారు.
Similar News
News February 24, 2026
శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.
News February 24, 2026
SKLM: ఫిబ్రవరి 25న జాబ్ మేళా..రూ.16-26 వేలతో ఉద్యోగాలు

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సీడాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25న శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం వద్ద జాబ్ మేళా జరుగనుందని డీఆర్డీఏ పథకం సంచాలకులు కిరణ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ సంస్థలైన డీ-మార్ట్, ఫ్యూషన్ ఫైనాన్స్ల్లో అసోసియేట్ క్యాషియర్, పర్చేజ్, రిలేషన్షిప్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. 19-35ఏళ్లు ఉండాలన్నారు. రూ.16-26 వేలు జీతం ఇవ్వనున్నారు.
News February 24, 2026
SKLM: గ్రీవెన్స్కు భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్లపైనే అధిక ఫిర్యాదులు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో అత్యధిక శాతం భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పైనే అర్జీలను ఇచ్చేందుకు స్థానికులు జడ్పీ బాట పట్టారు. అయితే గతంలో వచ్చిన ఫిర్యాదులనే మళ్లీ చేస్తున్నామని, చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని పోలాకి జడ్పీటీసీ చైతన్య కలెక్టర్కు స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్కు విన్నవించడం గమనార్హం. అత్యధికంగా నరసన్నపేటలో భూ సమస్యలపై ఫిర్యాదులొచ్చాయి.


