News August 18, 2025
శ్రీకాకుళం: ఆత్మహత్యకు యత్నించిన..కేజీబీవీ ప్రిన్సిపల్

పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్గా పని చేస్తూ ఇటీవల కవిటికి బదిలీ అయిన సౌమ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికే ఈమె బదిలీ వివాదం కొనసాగుతోంది. పలు యూనియన్లు ఈమెకు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సూసైడ్ కలకలం రేపుతుంది. శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News August 18, 2025
SKLM: ఎస్సీ గ్రీవెన్స్కు 43 వినతులు

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు 43 వినతులు ఎస్పీకి సమర్పించారు. నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన ఆయా ఫిర్యాదులపై విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి పొందేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. జూమ్ ద్వారా ఆయా పోలీస్ అధికారులతో మాట్లాడారు. న్యాయపరమైన చట్టపరమైన అంశాలను పరిశీలించాలన్నారు.
News August 18, 2025
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 138.6 వర్షపాతం నమోదు

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 30 మండలాల్లో 16 మండలాల్లో కురిసిన భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం మధ్యాహ్ననానికి జిల్లా మొత్తం మీద 138.6 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.4మి.మీ రికార్డు అయింది. వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో, కాలువుల్లో నీరు చేరుతుంది.
News August 18, 2025
మత్స్యకారులు వేటకు పోవద్దు.. శ్రీకాకుళం కలెక్టర్ సూచనలు

అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తీరం దాటే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇప్పటికే సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.