News June 26, 2024

శ్రీకాకుళం: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 12వ స్థానం

image

కాసేపటి క్రితం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,113మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,047 మంది పాసయ్యారు. జిల్లాలో 43శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 12వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్‌ గ్రూప్‌లో 341 విద్యార్థులు రాయగా 187మంది పాసయ్యారు. దీనిలో 55శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

Similar News

News October 6, 2024

రైలు నుంచి జారిపడి సిక్కోలు జవాన్ మృతి

image

రైలు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి శ్రీకాకుళం జిల్లా నందిగంకు చెందిన జీ.జగదీశ్వరరావు(37) అనే SSB(Sashastra Seema Bal) జవాన్ మృతిచెందాడు. సెలవుపై ఇంటికి వచ్చేందుకు గాను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతా నుంచి రైలులో వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 6, 2024

SKLM: పారదర్శకంగా ఇసుక సరఫరా: కలెక్టర్

image

ఇసుక పంపిణీ విధానం జిల్లాలో చట్టబద్ధంగా, సజావుగా, సులభతరంగా సాగేలా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి పలువురు అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక కొర‌త లేదని, ప్రస్తుతానికి 6000 మెట్రిక్ టన్నులు ఇసుక అందుబాటులో ఉందని, ఇసుక బుక్ చేసుకున్న 24 గంటల్లోనే సరఫరా చేస్తున్నామని వివరించారు.

News October 6, 2024

శ్రీకాకుళం: అక్ర‌మంగా ఇసుక‌ ర‌వాణా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఎక్క‌డైనా అక్ర‌మంగా ఇసుక త‌వ్వ‌కాలు జ‌రిపినా, అక్ర‌మంగా ఇసుక‌ను ర‌వాణా చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించారు.. వీరికి భారీగా జ‌రిమానా విధించ‌డంతోపాటు, కేసులు కూడా న‌మోదు చేస్తామ‌న్నారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై రూ.5.75 లక్షలు జరిమానా కూడా విధించామని, పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్ అధికారుల‌తో జిల్లా స్థాయి టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.