News October 18, 2024

శ్రీకాకుళం: ఇద్దరిని హత్య చేసి, వ్యక్తి సూసైడ్

image

శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు బెంగళూరులో మృతి చెందారు. పోలీసుల కథనం..గొల్లబాబు(45), లక్ష్మి పైతమ్మ (40) భార్యాభర్తలు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నారు. వీరితో పాటు గణేశ్ (20) ఓ బిల్డింగ్‌లో పనికి దిగారు. గణేశ్‌తో పైతమ్మకు వివాహేతర సంబంధం ఉందని గొల్లబాబు బుధవారం రాత్రి ఇరువురిని హత్య చేశాడు. గురువారం ఉదయం అతను ఉరేసుకుని చనిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ లోకేశ్ తెలిపారు.

Similar News

News February 20, 2026

శ్రీకాకుళంలో మర్చి 13 నుంచి రెవెన్యూ క్రీడలు

image

శ్రీకాకుళంలో వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లు టెక్కలి ఆర్డీవో ఎం. కృష్ణమూర్తి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులతో క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. మండలాల నుంచి ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News February 20, 2026

SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.

News February 20, 2026

SKLM: ఏపీ వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

APWJS. జిల్లా నూతన కమిటీ ఎన్నిక గురువారం నగరంలోని ఎన్.జి.ఓ. హోమ్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరాహ నరసింహులు, ప్రధాన కార్యదర్శి మెట్ట ధనుంజయ్, కార్యదర్శి అనపల చంద్రమోహన్ ట్రెజరర్ బొణిగి హరినారాయణ, గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోవింద మేఘనాథం, గౌరవ సలహాదారులు మురళీధరరావు, సహాయ కార్యదర్శి కామాల మురళీ కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల భాస్కరరావులు ఎన్నికయ్యారు.