News April 1, 2024

శ్రీకాకుళం: ఈనెల మూడో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ

image

జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంతవరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని వివరించారు. సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్ము ఇస్తారని లబ్ధిదారులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి పింఛన్లు పొందవచ్చని సూచించారు.

Similar News

News September 30, 2025

పిట్టవానిపేట సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేట గ్రామ సముద్ర రేవులో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు సముద్ర తీరంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో కొద్ది రోజులు క్రితం మృతి చెంది ఉండవచ్చునని మత్స్యకారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమచారం మేరకు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

News September 30, 2025

కోటబొమ్మాళి: అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు

image

అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం అన్నారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చన్న స్పష్టం చేశారు.

News September 30, 2025

మెళియాపుట్టి: ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

ప్రైవేట్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మెళియాపుట్టిలో మంగళవారం ఉదయం జరిగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో పలాస నుంచి పర్లాకిమిడి వైపు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న జేసీబీని తప్పించబోయిన రహదారిపై వెళ్తున్న పాదచారుడ్ని ఢీకొట్టంది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు చాపర గ్రామానికి చెందిన లక్ష్మణరావుగా పోలీసులు గుర్తించారు.