News April 11, 2025

శ్రీకాకుళం: ఈనెల 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

image

ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో చేపలు వేట నిషేధం ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 61 రోజులు పాటు వేటనిషేధం సమయంలో యాంత్రిక బోట్లు గాని, మోటారు బోట్లతో వేటకు వెళ్లరాద్దన్నారు. ఈ 61రోజుల వ్యవధిలో చేపలతో పాటు, సముద్రపు జీవులు గుడ్లు, పిల్లలు ఉత్పత్తి చేసే సమయం అయినందున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Similar News

News April 18, 2025

టెక్కలిలో చారిత్రాత్మక కట్టడాలలో కొన్ని ఇవే..

image

టెక్కలి చరిత్ర తెలిసే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం పూర్వం టెక్కలిలో రాజుల పరిపాలనలో ఉన్న రాజుగారి కోట, కోట భవనాలు, మిస్సమ్మ బంగ్లా, పురాతన ఆలయాలు టెక్కలిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం సీతానగరం వద్ద బ్రిటీష్ కాలం నాటి ముసళ్ల ఖానా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మండు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. WORLD HERITAGE DAY

News April 18, 2025

బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్‌లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.

News April 18, 2025

నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

image

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

error: Content is protected !!