News August 26, 2025
శ్రీకాకుళం: ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టు తుది జాబితా విడుదల

పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టు భర్తీకి సంబంధించి తుది జాబితా సోమవారం విడుదలైంది. వివరాలు శ్రీకాకుళం జిల్లా వెబ్సైట్ srikakulam.ap.gov.inలో ఉంచినట్లు సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. తొలి 10 మందికి 26న కలెక్టర్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీపీటీ పరీక్ష జరగనున్నట్లు ప్రకటించారు.
Similar News
News August 26, 2025
జి.సిగడాం: కత్తిపోట్ల దాడిలో యువకుడు మృతి

కత్తిపోట్లకు గురైన ఓ యవకుడు చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు జీసిగాడం(M) గెడ్డకంచారానికి చెందిన రాజశేఖర్, గొబ్బూరు గ్రామస్థుడు శంకర్ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్పై దాడి చేశారు. క్షతగాత్రుడుని స్థానికులు రిమ్స్లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.
News August 26, 2025
శ్రీకాకుళం: 28న DSC అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

డీఎస్సీ ఫలితాల్లో పలు విభాగాల్లోని పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28న జరగనుంది. ఈ మేరకు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీతో మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువ పత్రాలను గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో 3 సెట్ల జిరాక్స్, 5 ఫొటోలతో కేటాయించిన తేదీ, వేదికకు సమయానికి హాజరవ్వాలన్నారు.
News August 26, 2025
SKLM: సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటారు వాహన ప్రమాదాలు, ప్రీ-లిటిగేషన్ కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించబడనున్నాయన్నారు.