News March 26, 2025
శ్రీకాకుళం: ఈ మండలాల ప్రజలకు అలెర్ట్

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఆమదాలవలస-38.1 ఉష్ణోగ్రత, బూర్జ-39, హిరమండలం-39.2, ఇచ్ఛాపురం-37.5, జలుమూరు-38-2, కంచిలి-37.4, కోటబొమ్మాళి-37.5, కొత్తూరు-39.7, ఎల్ఎన్ పేట-39 నరసన్నపేట-37.4, పాతపట్నం-38.9, పొందూరు-37.7, సారవకోట-38.4, సరుబుజ్జిలి-38.5, టెక్కలి-37.6 మండలాలకు అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంది.
Similar News
News March 28, 2025
శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ. విజయకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ సాయంత్రం 5 గంటలకు శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరతాయని వివరించారు.
News March 28, 2025
SKLM: పది పరీక్షలకు 179 మంది గైర్హాజరు- డీఈఓ

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 179 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య శుక్రవారం తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 134 మంది, డిస్ట్న్స్ విభాగంలో 45 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదని వివరించారు. వేసవి దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
News March 28, 2025
వజ్రపుకొత్తూరుకు రానున్న సినీ నటి కవిత

వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు గ్రామానికి శుక్రవారం సినీ నటి కవిత రానున్నారు. గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలు సందర్భంగా ఆమె రానున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారని నిర్వాహకులు తెలిపారు.