News April 25, 2024
శ్రీకాకుళం ఎంపీకి రూ.23.29 కోట్ల ఆస్తులు
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన భార్య శ్రావ్య పేరిట రూ.23. 29 కోట్ల ఆస్తులున్నాయని నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. బీటెక్, ఎంబీఏ చదివినట్లు తెలిపారు. దంపతుల పేరిట రూ.6.78 కోట్ల చరాస్తులు, రూ.16.51 కోట్ల స్థిరాస్తులు, 2,335 గ్రాముల బంగారం, రూ.2.98 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News September 30, 2024
SKLM: ఈసీసీఈ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్
ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో దరఖాస్తు సోమవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు www.brau.edu.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, రూ.250 ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు కోసం విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.