News March 23, 2024

శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ హ్యాట్రిక్ కొట్టేనా..?

image

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 1952 నుంచి 2019 వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం ఎంపీగా కె.రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ఈసారి కూడా కూటమి కె.రామ్మోహన్ నాయుడుకే టికెట్ కేటాయించింది. అటు వైసీపీ నుంచి పేరాడ తిలక్‌ను జగన్ బరిలో దింపారు. వైసీపీని ఓడించి కె.రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొడతారా..? కామెంట్ చేయండి.

Similar News

News July 5, 2024

శ్రీకాకుళం: 8 నుంచి ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు

image

అగ్నివీర్, అగ్నిపథ్ స్కీమ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేయుటకు ఆసక్తి ఉన్న వారు ఈనెల 8 నుంచి 28వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి అధికారి శుక్రవారం తెలిపారు. అవివాహిత యువత ఇంటర్ లేదా 10వ తరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వివరాలకు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

News July 5, 2024

అమరావతి కోసం తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చిన ఎంపీ కలిశెట్టి

image

అమరావతి అభివృద్ధి కోసం ఎంపీగా అందుకొన్న తొలి గౌరవ వేతనాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును నేడు ఎంపీ కలిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు రూ.1.57 లక్షల చెక్కును ఆయన చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఎంపీని సీఎం అభినందించారు.

News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

image

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.