News December 22, 2024
శ్రీకాకుళం: ఎన్నికల క్లయిమ్స్పై సూపర్ చెక్

ఎన్నికల క్లెయిమ్స్పై సూపర్ చెక్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నిర్వహించారు. గడిచిన ఎన్నికలలో ఫారం 6, 7, 8 క్లెయిమ్స్కు సంబంధించి డిస్పోజ్ అయి క్లయిమ్స్లలో భారత ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన 23 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వయంగా సూపర్ చెక్ చేశారు. ఆయా క్లెయిమ్స్ కింద అర్జీ పెట్టుకున్న వారి ఇంటి వద్దకు బిఎల్ఓలు వెళ్లారా? లేదా? అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 21, 2026
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంతమంది రాయనున్నారంటే?

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కాగా మార్చి 20 తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 39,838 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం మొత్తం 70కి పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు మధ్య పరీక్షలు జరగనున్నాయి.
News February 21, 2026
శ్రీకాకుళం: మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం విడుదల

మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా ఎక్స్ గ్రేషియా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 95 మంది మత్స్యకారులు మృతిచెందగా వారిలో 90 మందికి రూ.4 కోట్ల 75 లక్షలు నిధులు విడుదల చేసి వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు జమ చేశామన్నారు. మిగిలిన ఐదుగురుకు సాంకేతిక కారణాల ద్వారా ఆగిందన్నారు.
News February 21, 2026
నరసన్నపేట: 48 గంటల్లోనే జాబ్ కార్డు మంజూరు

ఉపాధి హామీ పథకం లో భాగంగా లబ్ధిదారులు జాబ్ కార్డ్ కోరిన 48 గంటలలోనే మంజూరు చేయడం జరుగుతుందని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ లవ రాజు తెలిపారు. నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ప్రజా వేదికలో భాగంగా శుక్రవారం సాయంత్రం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వేతనదారుడికి పని కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.


