News January 20, 2025
శ్రీకాకుళం: ఎల్సీడీసీ కాంపెయిన్ ప్రారంభించిన డీఎంహెచ్ఓ

లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎల్సిడిసి)-2025 ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బాలమురళీకృష్ణ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు 14 రోజుల పాటు జరుగునున్న ఈ సర్వేలో సీహెచ్వోలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేస్తారని తెలిపారు. అదనపు డీఎంహెచ్ఓ డా. శ్రీకాంత్, డా.మేరీ కేథరిన్, డా.ప్రవీణ్, డీపీఎంఓ వాన సురేశ్ పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
SKLM: ‘డయేరియా బాధితులకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం’

డయేరియా వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవను పొందవచ్చని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ డైరెక్టర్ డాక్టర్ పీస అవని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ క్లినిక్లకు వెళ్లిన వారు తమను సంప్రదిస్తే ఉచితంగా వైద్యం అందించటం జరుగుతుందన్నారు. రిమ్స్, జేమ్స్, మెడికవర్, కిమ్స్, సింధూర ఏవన్ ఆసుపత్రులకు పంపించి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
News February 27, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 289 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం 289 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ బాటనీ ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1,538 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,500 మంది రాయాల్సి ఉండగా, 1,377 మంది విద్యార్థులు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు.
News February 27, 2026
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


