News June 20, 2024

శ్రీకాకుళం: ఐటీఐల్లో 112 మందికి ప్రవేశాలు

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో సీట్ల భర్తీకి ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో జరుగుతున్న తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో రెండో రోజు బుధవారం 112 మంది విద్యార్థులకు వివిధ ఐటీఐల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 464 మందిని కౌన్సెలింగ్‌కు పిలవగా 201 మంది హాజరయ్యారు. వీరిలో 112 మందికి సీట్లు కేటాయించారు. ఈరోజు 878 నుంచి 1,399 ర్యాంకు వరకు గల విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

Similar News

News October 4, 2024

శ్రీకాకుళం: దసరా వేళ.. భారీగా వసూళ్లు

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News October 4, 2024

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట విద్యార్థి

image

జాతీయస్థాయిలో ఢిల్లీలో జరగనున్న ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పలత ఎంపికైందని ప్రిన్సిపల్ పి లత, పిఈటీ భోగేశ్ గురువారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమె గెలుపొందిందని వివరించారు. ఢిల్లీ నోయిడా లో ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు.

News October 4, 2024

నరసన్నపేట కానిస్టేబుల్ మృతి UPDATE

image

నరసన్నపేట ఎక్సైజ్ ఆఫీసులో కానిస్టేబుల్‌ మోహనరావు గురువారం (33) ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాలు.. అతను ఇటీవలే పాతపట్నానికి బదిలీ అయ్యారు. గురువారం తన కార్యాలయంలో రిలీవ్ అయి పాతపట్నానికి బస్సులో బయల్దేరారు. అప్పటికే అతనికి జ్వరంగా ఉంది. దీంతో అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికులు ఆసుపత్రిలో చేర్పించగా ..చికిత్స పొందుతూ కన్నుమూశాడని తెలిపారు.మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.