News June 6, 2024

శ్రీకాకుళం: ఓకే నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ

image

ఇటీవలే విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా ఒకే నియోజకవర్గానికి చెందిన వారు గెలుపొందడంతో అక్కడ ప్రజానీకం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒకే నియోజకవర్గానికి చెందినవారు. ఇద్దరు కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశా భావం వ్యక్తం చేశారు.

Similar News

News September 29, 2024

శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

image

దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్‌ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.

News September 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్‌లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.

News September 29, 2024

దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్‌లో స్థూపం ఏర్పాటు

image

దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్‌ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.