News June 4, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న ఏజెంట్లు వివరాలు

image

సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్‌ అధికారులు, 77 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 492 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 582 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్‌లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్‌-4 ఉద్యోగులు మొత్తం 1996 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి

image

ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.

News September 14, 2025

శ్రీకాకుళం: కొత్తమ్మ జాతరలో వీడియో పోటీలు

image

కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన

image

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంద్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రం మీద వేటకు వెళ్లవద్దని సూచించారు. అల్ప పీడన ప్రభావం వలన సముద్రంలో రాకాసి అలలు ఎగసి పడతాయని హెచ్చరించారు.