News July 5, 2024

శ్రీకాకుళం: గడ్డి మందు తాగి మహిళ మృతి

image

పాలకొండకు చెందిన వివాహిత మాధవి(42) గురువారం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గారమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గత రాత్రి గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News July 8, 2024

శ్రీకాకుళం: ‘కల్కి బుజ్జి’ కారు పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి కారు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టారు. అయితే సోమవారం శ్రీకాకుళం జిల్లాకు బుజ్జి కారు రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కారు విజయనగరం నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం తెలిపారు.

News July 8, 2024

ఎచ్చెర్ల: ప్రభుత్వ ITIలో 10న ఉద్యోగ మేళా

image

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ITI ప్రవేశాల జిల్లా కన్వీనర్ సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ITI ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణులైన వారు ఈ మేళాకు హాజరు కావచ్చని చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు 10వ తేది ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు బయోడేటా, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.

News July 8, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఉచితంగా ఇసుక

image

నేటి నుంచి నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. జిల్లాలో రెండు నిల్వకేంద్రాల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా నిల్వ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుకను టన్ను రూ.340 ధరకు సామాన్యులకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.