News April 22, 2024
శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్

సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈనెల 23న రాత్రి ఎచ్చెర్ల నియోజకవర్గానికి చేరుకుంటారన్నారు. అక్కడే రాత్రి బస చేసి, 24న శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో బస్సు యాత్రను చేపడతారన్నారు. టెక్కలిలో ఈ బస్సుయాత్ర ముగుస్తుందని అన్నారు.
Similar News
News October 11, 2025
ఉత్తరాంధ్రలో చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్ప్లాంట్ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.
News October 11, 2025
టెక్కలి: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలోని తోటలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటలో వేలాడుతున్న వ్యక్తి టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్లో నివాసముంటున్న గణపతి(50)గా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News October 11, 2025
SKLM: ‘సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పట్టుబడి ఉందని ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన, రవికుమార్ గొండు శంకర్ అన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆక్ట్పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.