News May 15, 2024

శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి పంట రైతులు ఆందోళన

image

జిల్లాలోని కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో 35వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరి పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వరుసగా తుఫాన్లు, తెగుళ్ల బెడదతో కొబ్బరి రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కొబ్బరి పంట నాశనమైంది. నిత్యం పచ్చదనంగా కనిపించే ఉద్దానంలో కొబ్బరి మొక్కలు ఎండిపోతున్నాయి. 

Similar News

News October 1, 2024

కలెక్టర్‌ని కలిసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

image

ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.

News October 1, 2024

శ్రీకాకుళం: 12 మంది సీఐ, 21 మంది ఎస్సైలు బదిలీ

image

ఎక్సైజ్ Dy కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 12 మంది CI లను నూతనంగా నియమించారు. 21 మంది SIలు బదిలీ జరిగింది. CIలు గోపాలకృష్ణ-శ్రీకాకుళం, సతీష్ కుమార్-ఆమదాలవలస, అనురాధాదేవి-రణస్థలం, రాజు-పొందూరు, రమణమూర్తి-నరసన్నపేట, కృష్ణారావు-పాతపట్నం, కిరణ్మణీశ్వరి-కొత్తూరు, మీరాసాహెబ్-టెక్కలి, గాయత్రి-కోటబొమ్మాళి, మల్లికార్జునరావు-పలాస, బేబీ-సోంపేట, ప్రసాద్-ఇచ్ఛాపురానికి నియమితులయ్యారు.

News October 1, 2024

SKLM: పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి-కలెక్టర్

image

శ్రీకాకుళం నగరంలోని అక్టోబర్ 2న R&B అతిథి గృహం డచ్ బిల్డింగ్ వద్ద జిల్లాస్థాయి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసరాలను, నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.