News August 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే న్యూస్ ఇవే..!

జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీల నిరసన.
శ్రీకాకుళం జిల్లాకు మళ్లీ వర్షసూచన.
గణేష్ మండపాలపై అనుమతి తప్పనిసరి: జిల్లా ఎస్పీ.
బారువ: పర్యాటక ప్రాంతంపై పర్యవేక్షణ కరువు.
కోటబొమ్మాళి జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి.
దైవ దర్శనానికి వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు: ఎమ్మెల్యే కూన.
కొత్తూరు: పీడిస్తున్న బురదనీటి సమస్య.
Similar News
News August 22, 2025
శ్రీకాకుళం SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ–యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News August 21, 2025
టెక్కలి: సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ కొరకు 24 నుండి 28 లో తేదీ వరకు, సీట్ల కేటాయింపు 31 వ తేదీన ఉంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ, 74 ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు రావడంతో ప్రవేశాలపై ప్రిన్సిపాళ్ళు, సిబ్బంది దృష్టి సారిస్తున్నారు
News August 21, 2025
పైడిభీమవరంలో బాలికతో అసభ్య ప్రవర్తన: ఎస్సై

రణస్థలం (M) పైడిభీమవరానికి చెందిన 9వ తరగతి బాలికతో ఇప్పిలి సతీశ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో J.R.పురం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో కనిమెట్టకు చెందిన సతీశ్ మద్యంతాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్సై చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.